ఎంపీ దామోదర్ రావు తల్లి మృతి.. మాజీ సీఎం కేసీఆర్ సంతాపం..

Published : Mar 02, 2024, 03:59 PM IST
ఎంపీ దామోదర్ రావు తల్లి మృతి.. మాజీ సీఎం కేసీఆర్ సంతాపం..

సారాంశం

బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ దివకొండ దామోదర్ రావు తల్లి కన్నమూశారు. ఆమె మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు.

బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దివకొండ దామోదర్రావు తల్లి ఆండాలమ్మ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం కన్నుమూశారు. ఆమె మరణం పట్ల బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆండాలమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా..ఆండాళమ్మకు బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, సంజయ్ కుమార్, కేశవరావు, సంతోష్ కుమార్ లు నివాళి అర్పించారు.

PREV
click me!

Recommended Stories

Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??
Rain Alert: ఎండల వేడికి బ్రేక్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఐఎండీ కూల్ అప్‌డేట్