కసాయి తల్లి: పసిబిడ్డను బిల్డింగ్‌పై నుంచి విసిరేసింది

Siva Kodati |  
Published : Nov 14, 2020, 05:11 PM IST
కసాయి తల్లి: పసిబిడ్డను బిల్డింగ్‌పై నుంచి విసిరేసింది

సారాంశం

14 రోజుల పసికందు అన్న కనికరం లేకుండా భవనం పై నుంచి కిందకు విసిరేసింది ఓ తల్లీ. దీంతో పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఫతేనగర్ డివిజన్ నేతాజినగర్‌లో జరిగింది

14 రోజుల పసికందు అన్న కనికరం లేకుండా భవనం పై నుంచి కిందకు విసిరేసింది ఓ తల్లీ. దీంతో పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఫతేనగర్ డివిజన్ నేతాజినగర్‌లో జరిగింది.

కుత్బుల్లాపూర్‌కు చెందిన వేణుగోపాల్‌కు నేతాజినగర్‌కు చెందిన లావణ్యతో 2016లో వివాహం జరిగింది. వీరికి ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత ఈ దంపతులు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

ఈ తరుణంలోనే లావణ్య మరోసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం నేతాజినగర్‌లోని పుట్టింటికి వచ్చింది లావణ్య. అక్కడ కూడా మళ్లీ కుటుంబంలో గొడవలు రావడంతో ఈ నెల 29న ఎలుకల మందు తిని అస్వస్థతకు గురైంది.

ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే తరుణంలో లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పుట్టింటికి వచ్చిన లావణ్య.. భర్తపై వున్న కోపంతో నిన్న 14 రోజుల పసిబిడ్డను తాము నివసిస్తున్న భవనంపై నుంచి కిందకు విసిరేసింది. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే
IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!