ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డును అందుకున్న వడ్లమూడి అరుంధతి (వీడియో)

Published : Aug 27, 2018, 03:18 PM ISTUpdated : Sep 09, 2018, 01:10 PM IST
ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డును అందుకున్న వడ్లమూడి అరుంధతి (వీడియో)

సారాంశం

విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గాను వడ్లమూడి అరుంధతి గారికి ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డు లభించింది. మధర్ థెరిస్సా పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈమెకు ఈ అవార్డును అందించారు.

విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గాను తెలుగు అకాడమీ రీసెర్చ్ స్కాలర్ వడ్లమూడి అరుంధతి గారికి ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డు లభించింది. మధర్ థెరిస్సా  జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈమెకు ఈ అవార్డును అందించారు.

తన భార్య పేరు మీద ఈ అవార్డును ఓఎస్ శర్మ స్థాపించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించే వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందిస్తారు. అయితే 2018 కి గాను వడ్లమూడి అరుంధతి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో పాటు పలువురు రాజకీయ ప్రయుఖులు, విద్యావేత్తలు హాజరయ్యారు.
 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!
Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu