ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డును అందుకున్న వడ్లమూడి అరుంధతి (వీడియో)

Published : Aug 27, 2018, 03:18 PM ISTUpdated : Sep 09, 2018, 01:10 PM IST
ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డును అందుకున్న వడ్లమూడి అరుంధతి (వీడియో)

సారాంశం

విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గాను వడ్లమూడి అరుంధతి గారికి ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డు లభించింది. మధర్ థెరిస్సా పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈమెకు ఈ అవార్డును అందించారు.

విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గాను తెలుగు అకాడమీ రీసెర్చ్ స్కాలర్ వడ్లమూడి అరుంధతి గారికి ఓరుగంటి రమాదేవి మెమోరియల్ సర్వీస్ అవార్డు లభించింది. మధర్ థెరిస్సా  జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈమెకు ఈ అవార్డును అందించారు.

తన భార్య పేరు మీద ఈ అవార్డును ఓఎస్ శర్మ స్థాపించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించే వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందిస్తారు. అయితే 2018 కి గాను వడ్లమూడి అరుంధతి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో పాటు పలువురు రాజకీయ ప్రయుఖులు, విద్యావేత్తలు హాజరయ్యారు.
 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu