విషాదం: కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నం

Published : Jul 02, 2019, 03:24 PM ISTUpdated : Jul 02, 2019, 03:25 PM IST
విషాదం: కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నం

సారాంశం

నిజామాబాద్ జిల్లాలోని  వేల్పూరు మండలంలో విషాదం చోటు చేసుకొంది. రెండేళ్ల కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందింది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని  వేల్పూరు మండలంలో విషాదం చోటు చేసుకొంది. రెండేళ్ల కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందింది.

 నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలంలోని పడగల్‌కు చెందిన మౌనికకకు మూడేళ్ల క్రితం నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామానికి చెందిన రాజుతో  వివాహం జరిగింది.  

కారణాలు ఏమిటో తెలియదు కానీ మౌనిక తన మూడేళ్ల కూతురు నిప్పంటించి ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మౌనిక పరిస్థితి కూడ విషమంగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?