క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు.. విచారణకు హాజరైన మంత్రి తలసాని పీఏ

Published : Dec 12, 2022, 01:05 PM IST
క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు.. విచారణకు హాజరైన మంత్రి తలసాని పీఏ

సారాంశం

క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ విచారణ కొనసాగిస్తుంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ అశోక్ నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 

క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ విచారణ కొనసాగిస్తుంది. చీకోటి ప్రవీణ్‌ నిర్వహిస్తున్న క్యాసినో పేరుతో హవాలా లావాదేవీలు జరిపిన ఆరోపణల కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని విచారించిన సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను కూడా ఈడీ అధికారులు విచారించారు. తాజాగా సోమవారం మంత్రి తలసాని యాదవ్ పీఏ అశోక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు.. ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా నగదు చెల్లింపులపై ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu