Singireddy Niranjan Reddy : మంత్రి నిరంజన్ రెడ్డి వాహనంపై దాడి.. చెప్పులు, రాళ్లతోటి..

Published : Dec 03, 2023, 03:44 PM IST
Singireddy Niranjan Reddy :  మంత్రి నిరంజన్ రెడ్డి వాహనంపై దాడి.. చెప్పులు, రాళ్లతోటి..

సారాంశం

మంత్రి మల్లా రెడ్డి వాహనంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిగిరిన ఆయన వెహికిల్ పై కొందరు చెప్పులు,  రాళ్లతో దాడికి పాల్పడ్డారు. 

వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy)   తాజాగా మీడియాతో మాట్లాడి వెనెదిరిగారు. అక్కడా కాంగ్రెస్ హవానే కొనసాగుతుండటంతో మంత్రి కౌంటింగ్ కేంద్రం నుంచి బయల్దేరారు. 13 రౌండ్ల వరకు వేచి ఉన్న నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీని చూసి తన వెహికిల్ లో వెనుదిగిరారు. 

ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలోనే మీడియాతోనూ మాట్లాడారు. ఆ వెంటనే తన వాహనం వెళ్తుండగా.. కొందరు దుండగులు మంత్రి వెహికిల్ పై రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. దీంతో అక్కడ కాస్తా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీనే నిరంజన్ రెడ్డిపై దాడికి పాల్పడేలా చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం స్థంబించిన ట్రాఫిక్ | Asianet News Telugu
KTR : బిఆర్ఎస్ శ్రేణులకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. ఇక ఫ్యామిలీకే పరిమితం, పార్టీలకు దూరం