రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు..మంత్రి సాయం

Published : Jun 03, 2019, 04:29 PM IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు..మంత్రి సాయం

సారాంశం

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి మరీ తన వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  


తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి మరీ తన వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సోమవారం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ గుద్దేసింది. ఈ ఘటనలో వ్యక్తి కాలు లారీ కింద పడి నుజ్జునుజ్జు అయ్యింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి మల్లా రెడ్డి వెంటనే స్పందించారు. గాయపడిన వ్యక్తిని వెంటనే తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ ప్లాట్ ధరకే ఇండిపెండెంట్ ఇళ్లు... ఎక్కడో తెలుసా?
IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతోనే జోరువానలు, ఇప్పుడు ద్రోణి కూడా.. ఈ ప్రాంతాల్లో పెను బీభత్సమే