రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు..మంత్రి సాయం

Published : Jun 03, 2019, 04:29 PM IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు..మంత్రి సాయం

సారాంశం

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి మరీ తన వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  


తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి మరీ తన వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సోమవారం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ గుద్దేసింది. ఈ ఘటనలో వ్యక్తి కాలు లారీ కింద పడి నుజ్జునుజ్జు అయ్యింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి మల్లా రెడ్డి వెంటనే స్పందించారు. గాయపడిన వ్యక్తిని వెంటనే తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పవర్ ఫుల్ స్పీచ్ | KCR Powerful Speech at Praja Ashirvada Sabha
KCR: నా కొడకా.. నా చావు కోరుకుంటావా? వెయ్యి జన్మలెత్తినా నన్ను ఏమీ చేయలేరు ! కేసీఆర్ మాస్ కౌంటర్