బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్‌కి, తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక పురస్కారాలు

Siva Kodati |  
Published : Feb 25, 2021, 06:56 PM ISTUpdated : Feb 25, 2021, 07:05 PM IST
బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్‌కి, తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక పురస్కారాలు

సారాంశం

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అరుదైన పురస్కారం లభించింది. గతేడాదికి గాను ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అరుదైన పురస్కారం లభించింది. గతేడాదికి గాను ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.

2020 సంవత్సరంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు ‘‘బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’’గా కేటీఆర్‌ను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు వెల్లడించింది.

అలాగే పలు ఇన్నోవేటివ్‌, ఈ-గవర్నెన్స్ ఇన్షియేటివ్‌తో ప్రత్యేకత చాటిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘‘ఈ-గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’’గా స్కోచ్ ఎంపిక చేసింది.

ఇందుకు సంబంధించిన అవార్డును తెలంగాణ ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కేటీఆర్‌కు అందజేశారు. రాష్ట్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.  

 

 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి