డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో తెలుసా

Published : Oct 13, 2018, 02:47 PM IST
డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో తెలుసా

సారాంశం

 కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి డీకే అరుణపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని జూపల్లి విరుచుకుపడ్డారు.   

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి డీకే అరుణపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని జూపల్లి విరుచుకుపడ్డారు. 

డీకే అరుణ కుటుంబానికి అన్నీ దొంగ తెలివి తేటలే అంటూ ఘాటుగా విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ కేబినెట్‌లో డీకే అరుణ ఉన్నారని గుర్తుచేశారు. పాలమూరు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో పొత్తు జిల్లా నేతలు సమర్ధించడం సిగ్గుచేటన్నారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలోని ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు ఆగిపోతాయని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Advocate Allam Nagaraju Sensational Comments : బండి భగీరథ్ పై కేసు నిలవదు ?? | Asianet News Telugu
DECODE : బండి భగీరథ కి ఇన్నేళ్ల జైలుశిక్ష?? Advocate Allam Nagaraju On Bandi Bageerath Issue