పీవీకి భారతరత్న: కేసీఆర్‌తో విభేదించిన మజ్లిస్

Published : Sep 08, 2020, 03:51 PM ISTUpdated : Sep 08, 2020, 04:07 PM IST
పీవీకి భారతరత్న: కేసీఆర్‌తో విభేదించిన మజ్లిస్

సారాంశం

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను ఎంఐఎం వ్యతిరేకించింది. మంగళవారం నాడు ఉదయం తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను ఎంఐఎం వ్యతిరేకించింది. మంగళవారం నాడు ఉదయం తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ సమయంలో జరిగిన చర్చకు ఎంఐఎం గైర్హాజరైంది. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా ఎంఐఎం తెలిపింది. అంతేకాదు సభ నుండి వాకౌట్ చేసింది. 

also read:పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. టీఆర్ఎస్ తీసుకొన్న పలు కార్యక్రమాలకు ఎంఐఎం మద్దతుగా నిలిచింది. కానీ పీవీ నరసింహారావు విషయంలో ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది.

ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఇతర పక్షాలు కూడ మద్దతుగా మాట్లాడాయి. ఎంఐఎం మాత్రం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది.

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?