తెలంగాణ-బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

By Siva KodatiFirst Published Jan 11, 2023, 5:06 PM IST
Highlights

బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమైనట్లుగా తెలుస్తోంది

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమైనట్లుగా తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ కోబ్రా, తెలంగాణ గ్రేహౌండ్స్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. హిడ్మాపై రూ.45 లక్షల రివార్డ్ వుంది. 1996-97 మధ్యకాలంలో అతను మావోయిస్ట్ పార్టీలో చేరాడు. ఇతని స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా పూవర్తి. హిడ్మా నేతృత్వంలో గతంలో ఎన్నో మావోయిస్ట్ దాడులు జరిగాయి. ఇతని కోసం తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలిస్తూ వచ్చారు.  

click me!