కుప్పకూలిన వంతెన, రాకపోకలు బంద్

Published : Jul 18, 2017, 01:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కుప్పకూలిన వంతెన, రాకపోకలు బంద్

సారాంశం

కుప్పకూలిన మణిపూర్ వంతెన స్తంభించిపోయిన రవాణా రంగంలోకి దిగిన యంత్రాంగం బ్రడ్జి పునరుద్ధరణ చర్యలు

మణిపూర్‌ రవాణాలో అత్యంత కీలకంగా భావించే  102 నంబర్ జాతీయ రహదారిపై వంతెన కూలింది, దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దేశంలోని మిగతా ప్రాంతాలకు, ఆ రాష్ట్ర రాజధాని ఇంపాల్ తో రోడ్డు సంబంధాలు తెగిపోయాయి.

వంతెనపైనుంచి  భారీవాహనం ఒకటి వెళ్లినపుడు భారీశబ్దం చేస్తూ వంతెన కుప్పకూలింది. దీంతో ఈ రహదారిపై రాకపోకలు స్తంభించాయి.  సరుకుల రవాణా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. నిత్యావసరాలు అందక ప్రజలు ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

ఈ వంతెన కూలిన నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల కొరత ఏర్పడకుండా మణిపూర్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటోంది. ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన  వంతెన వద్దకు చేరుకుని పునరుద్ధరణ పనులను చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?