హైదరాబాద్ : నడిరోడ్డుపై కత్తులతో నరికి దారుణహత్య.. సెల్ఫీలు తీసుకున్న జనం

Siva Kodati |  
Published : Jan 22, 2023, 05:01 PM IST
హైదరాబాద్ : నడిరోడ్డుపై కత్తులతో నరికి దారుణహత్య.. సెల్ఫీలు తీసుకున్న జనం

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుల్సుంపురాలో ఆదివారం అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కత్తులు, కొడవళ్లతో నరికి చంపారు దుండగులు

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుల్సుంపురాలో ఆదివారం అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కత్తులు, కొడవళ్లతో నరికి చంపారు దుండగులు. ముగ్గురు కలిసి ఒకరిని నడిరోడ్డుపై నరికి చంపారు. యువకుడిని చంపుతుంటే కాపాడాల్సింది పోయి సెల్ఫీలు తీసుకున్నారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చనిపోయిన వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu