‘నీకోసం భార్యకు విడాకులిస్తా’.. వెంటపడి, వేధించి, మోసం చేశాడు..

By AN TeluguFirst Published Jun 25, 2021, 9:56 AM IST
Highlights

చిన్ననాటి ప్రేమంటూ, భార్యకు విడాకులిచ్చానంటూ ఓ యువతిని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. సందీప్ ప్రసాద్ అనే వ్యక్తికి అయిదేళ్ల కిందట వివాహమై ఒక బాబు ఉన్నాడు. 


చిన్ననాటి ప్రేమంటూ, భార్యకు విడాకులిచ్చానంటూ ఓ యువతిని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. సందీప్ ప్రసాద్ అనే వ్యక్తికి అయిదేళ్ల కిందట వివాహమై ఒక బాబు ఉన్నాడు. 

అయిదేళ్ల తరువాత ఓ ప్రైవేటు సంస్థలో ఐటీ రిక్రూటర్ గా పనిచేస్తున్న యువతి (31)ని కలిసిన సందీప్,  ఆమెను చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్ననని, పెళ్లి చేసుకుంటానని, భార్యకు విడాకులు ఇస్తానంటూ వెంటపడ్డాడు. ఈ విషయంలో సందీప్ ను పెద్దలు మందలించినా పట్టించుకోకుండా ఆమె వెంట పడటం, వేదించడం ప్రారంభించాడు. 

తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి మొదటి వారంలో యాదగిరిగుట్టలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలు బాగానే ఉన్నారు. తరువాత బెంగళూరు వెళ్లిన సందీప్ ప్రసాద్ ఆమె కూడా అక్కడికే రావాలని, లేదంటే పెళ్లి ఫొటోలు ఆమె తల్లిదండ్రులకు చూపుతానంటూ బెదిరింపులకు దిగాడు. మార్చి 31న బెంగళూరు నుంచివచ్చిన సందీప్ ప్రసాద్ ను ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరింది. 

తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని చెప్పిన అతను రెండు నెలల పాటు కుషాయిగూడ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారు. ఈ సమయంలోనే సందీప్ బలవంతంగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి కుటుంబసభ్యులు రవీందర్, ఇంద్రకుమార్, నాను, అరుణ్ ప్రసాద్ లు అంతా కలిసి ఆమెను బెదిరించారు. ఆమె ఇష్టంతోనే పెళ్లి జరిగినట్లు బేంగపేట పోలీస్ స్టేషన్లో చెప్పాలంటూ బలవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే యూసుఫ్ గూడలో నివసిస్తున్న బాధిత యువతి ఫిర్యాదు మేరకు సందీప్ ప్రసాద్ మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!