ఈ క్రమంలో friend భార్య మీద ప్రశాంత కన్ను పడింది. ప్రేమిస్తున్నానని అంగీకరించకపోతే చచ్చిపోతానని, లేదంటే చంపేస్తానని బెదిరించి ఆమె మీద rapeకు ఒడిగట్టాడు. విషయాన్ని ఎక్కడైనా చెబితే ఆమెను, ఆమె పిల్లలు, భర్తను చంపేస్తానని బెదిరించాడు.
పేట్ బషీరాబాద్ : స్నేహితుడి భార్య మీద కన్నేసి, బెదిరించి ఆమె మీద పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.. గాజుల రామారంలోని నెహ్రూ నగర్ కు చెందిన ప్రశాంత్ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి తరచూ వెల్తుండేవాడు.
ఈ క్రమంలో friend భార్య మీద ప్రశాంత కన్ను పడింది. ప్రేమిస్తున్నానని అంగీకరించకపోతే చచ్చిపోతానని, లేదంటే చంపేస్తానని బెదిరించి ఆమె మీద rapeకు ఒడిగట్టాడు. విషయాన్ని ఎక్కడైనా చెబితే ఆమెను, ఆమె పిల్లలు, భర్తను చంపేస్తానని బెదిరించాడు.
తన వద్ద వీడియోలున్నాయని, వాటిని అందరికీ పంపిస్తానని Threatening పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ.16 లక్షలు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
చివరికి victim పేట్ బహీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్నానన్న పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము..
మహిళపై సామూహిక అత్యాచారం..
హైదరాబాద్: ఓ మహిళను నమ్మించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.ఈ ఘటన Hyderabad గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది.గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలెనగర్ కంచెకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటుంది.
స్థానికంగా ఉండే Rafiq కు ఆమెతో పరిచయం ఏర్పడింది. షాహిన్నగర్ లో ఇల్లు ఇప్పిస్తానని ఆమెను Carలో తీసుకెళ్లారు. అక్కడే ఓ రూమ్ లో ఆమెను బంధించి ఇద్దరు స్నేహితులతో కలిసి Gang Rapeకు చేశాడు.
ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద వదిలేశాడు. ఈ విషయమై ఎవరికైనా చెబితే అంతు చూస్తామని నిందితుడు బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై వారం రోజులుగా తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారుత. అయితే వారం రోజుల తర్వాత ఆమె ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళలపై అత్యాచారాలు, దాడులను నివారించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకొంటున్నాయి. అయినా కూడ ఈ తరహా ఘటనలు ఆగడం లేదు. మహిళలపై దాడులను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. షీ టీమ్స్ మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకొంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చింది. ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను కూడా తీసుకొచ్చింది.
Telangana రాష్ట్రంలో గతంలో Dishaపై అత్యాచారం హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించించింది. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులంతా ఎన్కౌంటర్ లో మరణించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.ఈ కమిషన్ విచారణ నిర్వహిస్తుంది.
గతంలో Dlehiరాజధానిలో చోటు చేసుకొన్ని నిర్భయ ఘటన తర్వాత హైద్రాబాద్ లో జరిగిన దిశ ఘటన కూడా సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.