తల్లి వివాహేతర సంబంధం.. కొడుకుకి తెలియడంతో..

Published : Dec 28, 2020, 09:26 AM IST
తల్లి వివాహేతర సంబంధం.. కొడుకుకి తెలియడంతో..

సారాంశం

మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవాడన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. అలాంటి తల్లి తనకు లేకపోయినా పర్వాలేదని భావించి.. ఆమెను అతి దారుణంగా గొంతు పిసికి చంపేశాడు

కన్న తల్లి.. తన తండ్రిని కాదని.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవాడన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. అలాంటి తల్లి తనకు లేకపోయినా పర్వాలేదని భావించి.. ఆమెను అతి దారుణంగా గొంతు పిసికి చంపేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జగద్గిరిగుట్ట పోలీ‌స్ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ మహిళ(40) కూలి పని చేసుకుని జీవిస్తోంది. ఆమెకు భర్త, కుమారుడు కూడా ఉన్నారు. అయితే.. ఇటీవల ఆమెకు మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో  ఆమె కొంత కాలంగా ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 

విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు ఆటో డ్రైవర్‌(24) ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో తల్లి మెడకు దుప్పటి చుట్టి గొంతు పిసికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా  స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu