కరీంనగర్ జిల్లాలో దారుణం.. కన్నతల్లిని రోకలిబండతో కొట్టిచంపిన కొడుకు..

Published : Oct 24, 2022, 01:06 PM IST
కరీంనగర్ జిల్లాలో దారుణం.. కన్నతల్లిని రోకలిబండతో కొట్టిచంపిన కొడుకు..

సారాంశం

కరీంనగర్ జిల్లా ఇరుకుల్లలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కన్న తల్లిని కిరాతకంగా హత్య చేశాడు. తలపై రోకలిబండతో కొట్టి చంపాడు.

కరీంనగర్ జిల్లా ఇరుకుల్లలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కన్న తల్లిని కిరాతకంగా హత్య చేశాడు. తలపై రోకలిబండతో కొట్టి చంపాడు. వివరాలు.. ఇరుకుల్ల గ్రామానికి చెందిన లింగయ్య, రాజయ్య అన్నదమ్ములు. వీరికి ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో అడ్డుకునేందుకు వారి తల్లి యత్నించింది. అయితే ఆవేశంలో లింగయ్య రోకలిబండతో తల్లిపై దాడి చేశారు. దీంతో ఆమె మృతిచెందాడు. ఈ గొడవరకు లింగయ్య సోదరుడు రాజయ్యకు కూడా గాయాలు అయ్యాయి. 

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

తెలంగాణ యువతికి జర్మనీలో భారీ ఉద్యోగం.. నెలకు రూ.3.5 లక్షల జీతం
హైద‌రాబాద్‌లో కొత్త బ‌స్ ట‌ర్మిన‌ల్‌.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు చెక్