ఒకే మహిళతో ఇద్దరు స్నేహితులు అక్రమ సంబంధం.. చివరకు..!

By telugu news teamFirst Published Jun 30, 2021, 10:05 AM IST
Highlights

ఇర్ఫాన్, అజ్జూ అలీ స్నేహితులు. గత నెల 10న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇర్ఫాన్ తన మిత్రుడు అజ్జూ అలీని ఈత కోసమని బయటకు తీసుకువెళ్లాడు. 

ఇద్దరూ ఒకే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయంలో.. ఓ యువకుడు స్నేహితుడిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో  స్నేహితుడిని అతి దారుణంగా చంపేశాడు.. తర్వాత దానిని ప్రమాదంగా చిత్రీకరించాడు. కానీ.. పోలీసుల దర్యాప్తులో వారు చేసిన నేరం భయటపడింది. ఈ సంఘటన నారాయణగూడలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గత నెల మే 12న ఉదయం 10గంటల ప్రాంతంలో గోల్కొండ కుతుబ్ షాహీ మసీదు అట్టారాసిడి వద్ద ఉన్న బావిలో గుర్తు తెలియని యువకుడి శవం కనిపించింది. మాజిద్ ఖాన్ అనే వ్యక్తి తన కొడుకును వెతుక్కుంటూ పోలీసు స్టేషన్ కి వచ్చాడు. ఆ డెడ్ బాడీ రిసాల్ బజార్ లో నివాసముండే ఆటో ట్రాలీ డ్రైవర్ అజ్జూ అలీ(21) అని తేలింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శంషాబాద్ హినా గెస్ట్ హౌస్ వద్ద నివాసముండే ఆటో ట్రాలీ డ్రైవర్ మహమ్మద్ ఇర్ఫాన్(19) నిందితుడిగా గుర్తించారు.

ఇర్ఫాన్, అజ్జూ అలీ స్నేహితులు. గత నెల 10న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇర్ఫాన్ తన మిత్రుడు అజ్జూ అలీని ఈత కోసమని బయటకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ కలిసి రేషంబాగ్ లోని కుతుబ్ షాహీ మసీదు వద్ద ఉన్న బావిలో దిగారు.

అజ్జూ అలీ బావి మెట్లపై కూర్చుంటే.. ఇర్ఫాన్.. లోపలికి రావాలని బలవంతం చేశాడు. అందుకు అజ్జూ నిరాకరించడంతో.. బలవంతంగా లాగి వాటర్ లో పడేశాడు. దీంతో ఇర్ఫాన్ మృతి చెందాడు.

అయితే... ఇది హత్య కాదని ప్రమాదంగా అందరినీ నమ్మించాలని ఇర్ఫాన్ అనుకున్నాడు. ఓ మహిళ విషయంలో పగ పెంచుకొని..  అజ్జు ని ఇర్ఫాన్  చంపేసినట్లు తేలింది. వీరిద్దరికీ ఓ మహిళ తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో.. అజ్జూని చంపేసినట్లు తెలుస్తోంది. 

click me!