8యేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం.. అరెస్ట్..

By AN TeluguFirst Published Jun 30, 2021, 10:01 AM IST
Highlights

వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 55 యేళ్ల వ్యక్తి ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. సోమవారం రాత్ర ఈ దారుణం చోటు చేసుకుంది. 

వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 55 యేళ్ల వ్యక్తి ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. సోమవారం రాత్ర ఈ దారుణం చోటు చేసుకుంది. 

నిందితుడు రోజుకూలీగా పనిచేస్తున్నాడు. వ్యవసాయ పనులకు వెడుతుంటాడు. గీసుకొండ మండల్, విశ్వనాథ్ పుర్ గ్రామానికి చెందిన వ్యక్తి. చిన్నారి తండ్రి చనిపోవడంతో తల్లితో ఒంటరిగా ఉంటోంది. 

ఇది గమనించిన వ్యక్తి చిన్నారిని మభ్యపెట్టి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి.. అత్యాచార యత్నం చేశాడు. అయితే ఈ సమయంలో బాలిక కేకలు వేయడంతో.. అరుపులు విన్న స్థానికులు చిన్నారిని రక్షించారు. నిందితుడుకి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పారు.

click me!