వికారాబాద్‌లో మౌంటైన్ బైకింగ్.. బైక్ అదుపుతప్పి ఎన్ఆర్ఐ మృతి

By Siva KodatiFirst Published Jul 3, 2019, 9:24 AM IST
Highlights

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మౌంటిన్ బైక్ నుంచి పడి అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ దుర్మరణం పాలయ్యాడు

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మౌంటిన్ బైక్ నుంచి పడి అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ దుర్మరణం పాలయ్యాడు. అరవింద్ పిచాయ్ అనే వ్యక్తి వికారాబాద్ జిల్లా ధారూర్ హిల్స్ అండ్ వాలి అడ్వెంచర్ రిసార్ట్‌లో‌ బస చేశాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం గైడ్ లేకుండానే మౌంటిన్ బైక్ రైడింగ్ చేశాడు. ఈ సమయంలో బైక్ అదుపుతప్పి పల్టీ కొట్టి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 
 

click me!