దంపతుల మధ్య గొడవ.. కిడ్నాప్‌కు దారి తీసిన వ్యవహారం

By Siva KodatiFirst Published Oct 2, 2021, 7:39 PM IST
Highlights

నార్సింగ్ పీఎస్‌ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడవలు కిడ్నాప్‌కు దారితీశాయి. గాదె శంకర్ అనే వ్యక్తిని కల్వకర్తికి చెందిన ప్రశాంత్ కిడ్నాప్ చేసింది.

నార్సింగ్ పీఎస్‌ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడవలు కిడ్నాప్‌కు దారితీశాయి. గాదె శంకర్ అనే వ్యక్తిని కల్వకర్తికి చెందిన ప్రశాంత్ కిడ్నాప్ చేసింది. ప్రశాంత్ చెల్లెలు ప్రవళికకు శంకర్ బావ అవుతారు. గతకొంతకాలంగా ప్రవళిక, చైతన్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్తపై కోపంతో తన బావలు కిరణ్, శంకర్‌పై నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లోపుగానే శంకర్ ప్రవళిక బ్రదర్ ప్రశాంత్ కిడ్నాప్ చేశాడు. దీంతో శంకర్ భార్య నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

click me!