కిషన్ రెడ్డి ఫ్లెక్సీల దహనం: యువకుడిని చితకబాదిన బీజేపీ కార్యకర్తలు

Siva Kodati |  
Published : Jul 21, 2019, 01:04 PM IST
కిషన్ రెడ్డి ఫ్లెక్సీల దహనం: యువకుడిని చితకబాదిన బీజేపీ కార్యకర్తలు

సారాంశం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను ఓ యువకుడు తగులబెెట్టడంతో హైాదరాబాద్ ఆసిఫ్ నగర్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. 

హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆసిఫ్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కిషన్ రెడ్డి ఆధివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.

అయితే అక్కడ మంత్రికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఓ యువకుడు చించేసి, తగులబెట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు సదరు యువకుడిని పట్టుకుని చితకబాదారు.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Petrol: పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? అస‌లు వాస్త‌వం ఏంటి.?
హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే