యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఉన్మాది

Siva Kodati |  
Published : Feb 27, 2019, 10:09 AM IST
యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఉన్మాది

సారాంశం

వరంగల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. నగరంలోని హన్మకొండకు చెందిన రవళి అనే డిగ్రీ విద్యార్ధిని కాలేజీకి నడిచి వెళ్తోంది.

వరంగల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. నగరంలోని హన్మకొండకు చెందిన రవళి అనే డిగ్రీ విద్యార్ధిని కాలేజీకి నడిచి వెళ్తోంది. ఈ క్రమంలో అవినాష్ అనే యువకుడు ఆమెను అడ్డగించి నడిరోడ్డులోనే రవళిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

స్థానికులు ఆమెను కాపాడేందుకు ముందుకు రాగా వారిని అవినాశ్ బెదిరించాడు. స్థానికులు, తోటి విద్యార్థినులు మంటలను ఆర్పి.. రవళిని ఆసుపత్రికి తరలించారు. ప్రేమను వ్యతిరేకించడం వల్లే రవళిపై అవినాశ్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

సీఐడీ విచారణకు Padi Kaushik Reddy | Sammakka-Saralamma Jatara Case | BRS MLA | Asianet News Telugu
CM Revanth Reddy Speech: ఈలోపం దేశ భవిష్యత్తుకు చాలాఇబ్బందికరం | AI Challenges | Asianet News Telugu