కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారు. దీంతో నగరంలోని ఆర్యసమాజ్లో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడ్డారు. ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.కానీ వారిపై ఓ ముఠా కన్నుపడింది. వారిని కిడ్నాప్ చేశారు. అనంతరం వాళ్లకి చిత్ర హింసలు పెట్టారు. ఈ సంఘటన సుల్తాన్ నగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నారాయణపేట్జిల్లా బండగొండ గ్రామానికి చెందిన శివశంకర్గౌడ్(23), అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారు. దీంతో నగరంలోని ఆర్యసమాజ్లో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
పెళ్లి చేసుకోవాలని భావించి ముందుగానే ఈనెల 3న నగరానికి వచ్చారు. గురువారం శివశంకర్, అతను ప్రేమించిన యువతి కాచిగూడ క్రాస్లో ఉన్న ఓ మాల్ సెల్లార్లో ఉండగా అమ్మాయి తరపు బంధువులు ఇద్దరిపై దాడిచేసి కారులోకి తీసుకెళ్లారు.
సినీ ఫక్కీలో వారిపై ఇష్టానుసారంగా దాడులు చేశారు. శివ శంకర్ ని దారుణంగా చితకబాది.. అనంతరం తమ అమ్మాయిని తీసుకొని వెళ్లిపోయారు. కాగా.. యువతి స్నేహతురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బడీచౌడి ఆర్యసమాజ్, కాచిగూడ బిగ్బజార్ వద్ద సీసీ ఫుటేజిని పరిశీలించారు. కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కారు ఓనర్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు మద్దూర్ పోలీసుస్టేషన్కు సమాచారం అందించారు.
దీంతో అక్కడి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని సుల్తాన్బజార్ పోలీసులకు అప్పగించారు. శుక్రవారం తెల్లవారు జామున ఆరుగురు కిడ్నాపర్లు కోట్టం కష్ణారెడ్డి(43), కోట్టం శ్రీనివాస్రెడ్డి(23), జి.తిరుపతి(23), కె.శ్యాంరావురెడ్డి(27), కె.పవన్కుమార్రెడ్డి(21), పి.హరినాథ్రెడ్డి(29)లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.