సిద్దిపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..

Published : Sep 10, 2022, 10:14 AM IST
సిద్దిపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య..

సారాంశం

సిద్దిపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ములుగు  మండలం అడవి మజీద్‌లో చెట్టుకు ఉరి  వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను మహేష్, స్వప్నలుగా గుర్తించారు. 

సిద్దిపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ములుగు  మండలం అడవి మజీద్‌లో చెట్టుకు ఉరి  వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను మహేష్, స్వప్నలుగా గుర్తించారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

ఇక, గత నెలలో జనగామ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామం భిక్యతండా వద్ద గల పల్లె ప్రకృతి వనం వద్ద గుగులోతు రాజు, ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుగులోతు రాజు వయస్సు 20 సంవత్సరాలు కాగా.. యువతి వయస్సు 16 సంవత్సరాలు. వివరాలు.. యువతి ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమెకు రాజుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమంలో ఉన్నారు. 

అయితే వారి పెళ్లి ప్రతిపాదనను అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించడంతో.. వారు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇక, అయితే రాజు బలవంతంగా తమ బిడ్డకు పురుగుల మందు తాగించి హత్యచేసి ఉంటాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక, రాజు హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం