ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఆర్మూర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఆర్మూర్ మండలం ఆలూరుకు చెదిన చిత్తారి సాయిలు, గోసంగి శైలజలు ఈ నెల 26వ తేదీ నుండి కన్పించకుండా పోయారు. అదే రోజు సాయంత్రం వీరి కోసం రెండు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీరిద్దరూ ఉపయోగించే సెల్ ఫోన్ ఆధారంగా జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ శివారులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సికింద్రాపూర్ శివారులోని గుట్టపై వెతికారు. ఈ గుట్టపై ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఆలూరు గ్రామానికి చెందిన శైలజకు గతంలోనే పెళ్లి జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఆమెకు భర్త మరణించాడు. ఆమె తన కూతురితో జీవిస్తోంది. కూలీపని చేస్తూ జీవనం సాగించేది.
అదే గ్రామానికి చెందిన చిత్తారి సాయిల్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
దీంతో ఇరు కుటుంబాల మధ్య కొన్నిసార్లు గొడవలు కూడ జరిగాయి.దీంతో వీరిద్దరూ చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఈ నిర్ణయం మేరకు వీరిద్దరూ ఇంటి నుండి వెళ్లిపోయారు. శైలజ, సాయిలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. మృతదేహాల పక్కనే పురుగుల మందు డబ్బాను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.