అబ్దుల్లాపూర్మెట్లో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్న ప్రేమ జంటపై అమ్మాయి మేనమామ గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో వివాహిత భర్తకు గాయలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు కోసం పోలీసు గాలింపు చేస్తున్నారు.
హైదరాబాద్ నగర శివారులో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్నారని దంపతులపై ఆరేండ్ల తరువాత అమ్మాయి మేనమామ దాడి చేశాడు. విచక్షణ రహితంగా గొడ్డలితో నరికాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం… అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామ పరిధిలోని సూర్మాయిగూడకు చెందిన గంగని శివకుమార్ (28), అదే గ్రామానికి చెందిన మరో ఓ మైనారిటీ యువతి గంగ ని 2016లో ప్రేమించి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా..వీరి పెళ్లిని అమ్మాయి తరుపు బంధువు తరుచు వ్యతిరేకిస్తునే ఉన్నారు. తరసపడినప్పుడల్లా.. వాగ్వాదం జరుగుతునే ఉండేది.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శివకుమార్, ఆయన భార్యగంగ, చిన్న కుమారుడికి జ్వరం వస్తే హాస్పిటల్లో చూపించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అబ్దుల్లాపూర్మెట్ షాడో హాస్పిటల్ ముందు రాగానే ఆ దంపతులకు .. యువతి మేనమామ జహంగీర్ తారసపడ్డాడు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. కోపోద్రేకానికి గురైన యువతి మేనమాన భార్యాభర్తలను కులం పేరుతో దూషిస్తూ ఒక్క సారిగా గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. విచక్షణ రహితంగా దాడి చేశాడు.
ఈ ఘటనలో భర్త శివకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి గాయపడిన శివకుమార్ను స్థానికంగా ఉన్న హయత్ నగర్లోని సన్రైజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన భర్త శివకుమార్ పై దాడికి పాల్పడిన మేనమామ జహింగీర్ పై చర్యలు తీసుకోవాలని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని తెలుసుకున్న నిందితుడు జహంగీర్ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.