‘సోది క్లాస్’ అంటూ.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన విద్యార్థిని.. ఆ లెక్చరర్ రియాక్షన్ తో కథ రివర్స్..

Published : Nov 30, 2022, 06:49 AM IST
‘సోది క్లాస్’ అంటూ.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన విద్యార్థిని.. ఆ లెక్చరర్ రియాక్షన్ తో కథ రివర్స్..

సారాంశం

కాలేజీకి వచ్చి బుద్దిగా చదువుకోక.. లెక్చరర్ పాఠాలు చెబుతుంటూ ఫొటో తీసి ‘సోది క్లాస్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందో అమ్మాయి. ఇది ఆ లెక్చరర్ కు తెలియడంతో ఆమెతో పాటు మరికొందరిని చితకబాదింది. 

కామారెడ్డి : పాఠం చెబుతున్నప్పుడు ఫొటో తీసి.. ‘సోది క్లాస్’.. అంటూ ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసింది. దీంతో ఆగ్రహించిన టీచర్ ఆమెతో పాటు క్లాస్ లోని మరికొందరు అమ్మాయిలను చితకబాదింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ ఆదర్శ (మోడల్)స్కూల్ లో చోటు చేసుకుంది. ఈ ఉదంతం మీద తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఈ మేరకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... 

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నాలుగు రోజుల క్రితం తెలుగు లెక్చరర్ మహేశ్వరి లెసన్ చెబుతుండగా ఓ విద్యార్థిని సెల్ ఫోన్లో ఫోటో తీసింది. సోదీ క్లాస్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటో పోస్ట్ చేసింది. ఈ విషయం లెక్చరర్ కు తెలిసింది. క్లాస్ రూంలోకి సెల్ ఫోన్ తీసుకురావడమే కాకుండా.. తన ఫొటో ఎందుకు తీశావని సదరు విద్యార్థినిని నిలదీసింది. దీంతో ఆ విద్యార్థిని తప్పయింది. క్షమించమని వేడుకుంది. అయితే కోపం తగ్గని ఉపాధ్యాయురాలు గది తలుపులు పెట్టి అమ్మాయిలను ఒక చోట నిలబెట్టి కొందరిని కర్రతో చితకబాదింది. ఈ ఘటనను కొందరు బాలురు వీడియో తీశారు. 

తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర: ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్

బాలికలు బోరున ఏడుస్తూ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. లెక్చరర్ తో వాగ్వాదానికి దిగారు. ఆమెను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ఈ  విషయం మీద మహేశ్వరిని అడిగితే సోషల్ మీడియాలో తన ఫొటో పెట్టినందుకు కొట్టిన మాట నిజమేనని ఒప్పుకుంది. ఉన్నతాధికారులకు నివేదిక పంపి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ లావణ్య పేర్కొన్నారు. మహేశ్వరి మీద ఓ విద్యార్థిని మద్నూర్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. 

విద్యార్థులు టీచర్లను ఏడిపించడం ఇప్పుడొక ట్రెండ్ అయిపోయింది. ముందు ఆ స్టూడెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే పెద్ద తప్పు.. ఆ తరువాత టీచర్ దానికి స్పందించిన తీరు మరింత తప్పు.. ప్రిన్సిపల్ కి చెప్పి.. తల్లిదండ్రులతో వార్నింగ్ ఇప్పిస్తే పోయేది. కానీ ఆమె కాస్త ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల పరిస్తితి చేయిదాటిపోయింది అని స్థానికులు అనుకుంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu