మద్యం మానేయాలని భార్యకు భర్త వార్నింగ్: షాకిచ్చిన వైఫ్

Published : Feb 04, 2019, 12:51 PM IST
మద్యం మానేయాలని భార్యకు భర్త వార్నింగ్: షాకిచ్చిన వైఫ్

సారాంశం

మద్యం మానేయాలని భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన  ఓ వివాహిత    ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.


హైదరాబాద్:  మద్యం మానేయాలని భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన  ఓ వివాహిత    ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ కడక్‌పూర్ ప్రాంతానికి చెందిన నాగవెల్లి లక్ష్మి, సికింద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన రాము  ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరు ప్రస్తతం సికింద్రాబాద్  బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నారు.  కొన్ని మాసాలుగా  లక్ష్మీ మద్యానికి బానిసగా మారింది.

మద్యం తాగొద్దని భార్య లక్ష్మీని  భర్త రాము కోరేవాడు.  అయినా ఆమె అతని మాటలు పట్టించుకొనేది కాదు. రాత్రి పూట తన కొడుకుతో మద్యం తెప్పించుకొని  తాగేది. శనివారం నాడు కూడ మద్యం తాగిన భార్య లక్ష్మిని భర్త రాము తీవ్రంగా మందలించాడు.

భర్త  మందలించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Holidays: విద్యార్థులతో పాటు ఉద్యోగులకు ఊహించని సెలవులు.. ఈ నెలలో 3 రోజుల లాంగ్ వీకెండ్
ఉద్యోగం చేశావా.? పైస‌లు ప్రింట్ చేశావా.? హైదరాబాద్‌లో చిక్కిన భారీ అవినీతి తిమింగ‌ళం