పీసీసీ చీఫ్ మార్పుపై చర్చే లేదు: కుంతియా

Published : Sep 05, 2019, 05:26 PM IST
పీసీసీ  చీఫ్ మార్పుపై చర్చే లేదు: కుంతియా

సారాంశం

పీసీసీ చీఫ్ పదవి మార్పు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని కుంతియా కుండబద్దలు కొట్టారు. 

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీ ఇంచార్జీ కుంతియా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని  ఆయన చెప్పారు.

ఈ  నెల రెండో వారంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కుంతియా తెలిపారు.నీటి పారుదల, విద్యుత్ శాఖల్లో తెలంగాణ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని  ఆయన ఆరోపించారు.

ఈ విషయంలో తమ పార్టీ ఉద్యమం నిర్వహించనుందన్నారు.  కేసీఆర్ సర్కార్ పాల్పడిన అవకతవకలను బయటపెడతామన్నారు. కేసీఆర్ సర్కార్ కుంభకోణాలను బయటపెట్టేందుకు పార్టీ తరపున ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో అవినీతి చోటు చేసుకొందన్నారు.  ఈ అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని కుంతియా డిమాండ్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?