కెసిఆర్ పై 50వేల మెజార్టీతో గెలుస్తా

First Published Jul 15, 2017, 1:03 PM IST
Highlights
  • కెసిఆర్ నల్లగొండలో పోటీచేస్తే 50 మెజార్టీతో గెలుస్తా
  • తెలంగాణ సర్కారు పతనం మొదలైంది
  • అన్ని పార్టీలు ఏకమైనా కాంగ్రెస్ గెలుపు ఆపలేరు

తెలంగాణ సిఎం కెసిఆర్ పై వరుస సవాళ్లు విరుసుతున్నారు సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గజ్వెల్ లోనే కెసిఆర్ ను ఓడిస్తానంటూ ఇటీవల సవాల్ చేసిన కోమటిరెడ్డి తాజాగా మరో సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌ నల్లగొండలో తనపై పోటీచేస్తే 50 వేల మెజార్టీతో గెలుస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటలో ఆయన మాట్లాడారు.

 

రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనా కాంగ్రెస్‌ను ఓడించలేవన్నారు. మూడేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని పేదల, రైతుల శ్రేయ స్సే ధ్యేయమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 

 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పతనం మొదలైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. మొత్తానికి కెసిఆర్ పై సవాళ్ల మీద సవాళ్లు విసరడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

 

click me!