కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆదివారం మునుగోడులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆదివారం మునుగోడులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు అమిత్ షా.
కాగా.. కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. సోనియా గాంధీకి లేఖ పంపారు.ఈ నెల 8వ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను స్పీకర్ అదే రోజున ఆమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.