మీ పద్ధతి బాగాలేదు : కోదండరాం

Published : May 04, 2018, 04:19 PM IST
మీ పద్ధతి బాగాలేదు : కోదండరాం

సారాంశం

కోదండరాం సీరియస్ అయ్యారు

తెలంగాణ వ్యాప్తంగా గురువారం కురిసిన భారీ వర్షం వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో 5 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రకటన కింద ఉంది చదవండి.

1 .కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చాలా మందకొడిగా సాగుతున్నది.చాలా మంది రైతులు రోజుల తలబడి మార్కెట్లలో తూకం కోసం ఏదురు చూడవలసి వస్తున్నది.కేవలం కొనుగోళ్ళు ఆలస్యం కావడం వల్లనే చాలా మంది రైతులు సమయానికి అమ్ముకోలేక పోయారు.అందువలన ధాన్యం తడిచి నష్టపోయారు.

2 .యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలి.

3 .ఆకాల వర్షం వలన నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి.

4 .అరటి ,మామిడి పంటలు పూర్తిగా ధ్వంసం అయి పోయినందున ఆయా ప్రాంతాల రెవిన్యూ మరియు వ్యవసాయ అధికారులు స్పందించి వారికి తగిన సాయం అందేలా చర్యలు చేపట్టాలి.

5 . పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం పిడుగుల బారిన పడి ౧౦ మంది చనిపోయారు.ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలి.భాదిత కుటుంబాలను ఆదుకోవాలి.

ఇట్లు..

ప్రొ.కోదండరాం
అధ్యక్షులు
తెలంగాణ జన సమితి.

PREV
click me!

Recommended Stories

ఖమ్మం భహిరంగ సభకి సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ | CM Revanth Reddy Grand Mass Entry
హైద‌రాబాద్‌లో క‌చ్చితంగా ఇల్లు కొనాల‌ని రూలు ఏం లేదు బ్రో.. ప్లాన్ బీ ఆప్ష‌న్ కూడా ఉంది