తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి వివరణ.. ఎంతో ప్రాధానత్య ఇచ్చినట్టుగా వెల్లడి..

Published : Jun 17, 2023, 01:45 PM IST
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి వివరణ.. ఎంతో ప్రాధానత్య ఇచ్చినట్టుగా వెల్లడి..

సారాంశం

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 

హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఏం చేసిందనే దానిని ‘‘రిపోర్టు టూ పీపుల్‌’’ పేరుతో వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తద్వారా తెలంగాణ ప్రజలకు చేకూరిన లబ్ధి గురించి ఆయన వివరించారు. కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని అన్నార. గత 9 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఉద్దేశ్యమని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ సర్కార్‌ నిరంతరం సహకరించిందని కిషన్‌ రెడ్డి తెలిపారు.  గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని అన్నారు. రాష్ట్రాలకు సంపూర్ణ సహకారంలో భాగంగా తెలంగాణకు కేంద్రం రూ. 1.78 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. రోడ్ల కోసం రూ. 1.08 లక్షల కోట్లు, రైల్వేల కోసం రూ. 32,823 కోట్లు కేటాయించిందని చెప్పారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ రెండవ దశ చాలా రోజులు ఆలస్యం అయ్యిందని చెప్పారు. చివరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొంత భూమి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రం అనుమతి ఇచ్చిందని.. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. దీంతో 3వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రామగుండంలో అతిపెద్ద నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్‌ ప్లాంట్‌ని ప్రధాని మోదీ ప్రారంభించారని గుర్తుచేశారు. 

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందే భారత్ రైళ్లలో రెండు తెలంగాణలో నడుస్తున్నాయని  చెప్పారు.  రాష్ట్రంలో అనేక రైల్వే స్టేషన్ల అబివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భూ సేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యమవుతున్నాయని తెలిపారు. 2014 తర్వాత తెలంగాణలో 11 సాగు నీటి ప్రాజెక్ట్ లకు ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసిందని  చెప్పారు. రోడ్ల నిర్మాణంలో గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే