కేసీఆర్ మూడో సారి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయం : మంత్రి హ‌రీశ్ రావు

Published : Sep 11, 2023, 04:36 PM IST
కేసీఆర్ మూడో సారి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయం :  మంత్రి హ‌రీశ్ రావు

సారాంశం

Siddipet: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందనీ, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదనీ, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను నమ్మబోర‌ని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ హామీలను ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

Telangana health minister T Harish Rao: తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమ ముఖ్యమంత్రిని ప్రకటించారనీ, కే చంద్రశేఖర రావు (కేసీఆర్) మూడోసారి అధికారంలోకి వస్తారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తంచేశారు. త్వరలో హైదరాబాద్ లో జరగనున్న ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రకటనలను ప్రజలు నమ్మరనీ, 60 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రగతి సాధిస్తోందనీ, రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని కొనియాడారు.

సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన 7,200 మంది మత్స్యకారులకు మంత్రి హరీశ్ రావు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. మత్య్సకారుల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు కేటాయించిన ఏకైక నాయకుడు చంద్రశేఖర్ రావు అనీ, ఇది మరే రాష్ట్రంలోనూ లేని అద్వితీయమని కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, అబద్ధాల మధ్య పోరు జరుగుతుందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ హామీలను ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తప్పుడు ప్రకటనలు చేసే కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మరనీ, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే స్వీయ ప్రకటన చేశారని పునరుద్ఘాటించారు.

చేపల ఉత్పత్తిలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని సాధించిందనీ, సిద్దిపేట నుంచి విజయవాడ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చేపలు ఎగుమతి అవుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఉందనీ, రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించడం చాలా అవసరమని ఉద్ఘాటించారు. ఉచితంగా చేపలు, రొయ్యలు, మేకలు పంపిణీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాంభూక్య, రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సమాఖ్య వైస్ చైర్మన్ డీటీ మల్లయ్య, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి