కేసీఆర్ మొక్కను నరికేశారు

Published : Nov 23, 2018, 12:12 PM IST
కేసీఆర్ మొక్కను నరికేశారు

సారాంశం

మొదటి విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్  కరీంనగర్ జిల్లా తదిమ్మపూర్  మండలం ఎల్ఎండీ కరకట్ట దిగువన ఒక మొక్కను నాటిన సంగతి తెలిసిందే.

తెలంగాణ సీఎం కేసీఆర్ నాటిన మొక్కను నరికేశారు. మొదటి విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్  కరీంనగర్ జిల్లా తదిమ్మపూర్  మండలం ఎల్ఎండీ కరకట్ట దిగువన ఒక మొక్కను నాటిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ మొక్క మూడేళ్లలో చాలా ఎత్తుగా బలంగా పెరిగింది.

అయితే ఆ మొక్కను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. బుధవారం వరకు బాగానే ఉన్నచెట్టు.. గురువారానికి నేలకు ఒరిగిపోయింది. చెట్టును నరికేసి.. పక్కనే వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. కావాలనే చెట్టును నరికేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనాస్థలిని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu