కృష్ణా, గోదావరి నదుల అనుసంధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది: బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్

Published : Oct 15, 2023, 11:06 AM IST
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది: బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్

సారాంశం

Hyderabad: కృష్ణా, గోదావరి నదుల అనుసంధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని తెలంగాణ‌ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికైన ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్ ముందు తమ వాదనలను తగినంతగా ముందుకు తెచ్చి కృష్ణా జలాల్లో రాష్ట్రానికి సరైన వాటాను సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.   

Telangana  BJP President G Kishan Reddy: కృష్ణా, గోదావరి నదుల అనుసంధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని తెలంగాణ‌ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికైన ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్ ముందు తమ వాదనలను తగినంతగా ముందుకు తెచ్చి కృష్ణా జలాల్లో రాష్ట్రానికి సరైన వాటాను సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) కుటుంబానికి సాగునీటి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారినందునే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ. కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. గ్రావిటీ ద్వారా సాగునీరు, తాగునీరు ఎక్కువగా విస్తరించే అవకాశం ఉన్నందున తక్కువ ప్రాజెక్టు వ్యయంతో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుకూలంగా లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి రైతుకూ సమగ్ర పంటల బీమా వర్తింపజేస్తామని ఆయన ప్రకటించారు. కేంద్రం కొత్తగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుపై రైతు సదస్సులో నీటిపారుదల నిపుణులు, ఇంజినీర్లు ఆనందం వ్య‌క్తం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే 2014 తర్వాత కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు మరింత అన్యాయం జరిగిందనీ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికైన ప్రభుత్వం నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ట్రిబ్యునల్ ముందు తన వాదనలను తగినంతగా ముందుకు తెచ్చి కృష్ణా జలాల్లో రాష్ట్రానికి సరైన వాటాను సాధించాలన్నారు. 

గతంలో ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలకు అదనంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన 194 టీఎంసీల నీటిని తాజాగా 1,005 టీఎంసీలకు చేర్చి తాజాగా రెండు రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. మూడు సంవత్సరాల నిర్ణీత వ్యవధిలో కొత్త ట్రిబ్యునల్ ద్వారా రెండు రాష్ట్రాల మధ్య కేటాయింపుల గురించి ప్ర‌స్తావించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech