హైదరాబాద్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కే కవిత వెలుగుమట్లా నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు సరైన పునరావాసం కల్పించాలని, వారి హక్కులను కాపాడాలని కవిత ఈ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వచ్చి ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.