హైద్రాబాద్ పహడీషరీఫ్ కేసులో పురోగతి: క్యాబ్‌ను ఎత్తుకెళ్లింది కర్ణాటక ముఠాగా గుర్తింపు

Published : Apr 07, 2023, 04:35 PM ISTUpdated : Apr 07, 2023, 04:48 PM IST
హైద్రాబాద్ పహడీషరీఫ్ కేసులో  పురోగతి: క్యాబ్‌ను ఎత్తుకెళ్లింది  కర్ణాటక  ముఠాగా గుర్తింపు

సారాంశం

 హైద్రాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో  కారును ఎత్తుకెళ్లిన  నిందితులను  పోలీసులు గుర్తించారు.  నిందితుల కోసం  పోలీసులు గాలింపు  చర్యలు చేపట్టారు. 

హైదరాబాద్: నగరంలోని  పహాడీ షరీఫ్  పోలీస్ స్టేషన్ పరిధిలో   డ్రైవర్ ను కొట్టి క్యాబ్ ను ఎత్తుకెళ్లిన కేసులో   పోలీసులు పురోగతిని సాధించారు.  కర్ణాటకకు  చెందిన   ముఠా  క్యాబ్ ను  దొంగిలించారని  పోలీసులు గుర్తించారు . గురువారం నాడు  అర్ధరాత్రి  శంషాబాద్  ఎయిర్ పోర్టులో  నిందితులు క్యాబ్ ను బుక్ చేసుకున్నారు.  బాలాపూర్  సమీపంలోని  నిర్మానుష్క ప్రాంతంలోకి  తీసుకెళ్లిన  తర్వాత  డ్రైవర్ ను కొట్టి  క్యాబ్ ను  ఎత్తుకెళ్లారు  దుండగులు .

also read:హైద్రాబాద్‌లో దారుణం: డ్రైవర్‌ను కొట్టి క్యాబ్‌ ను ఎత్తుకెళ్లిన దుండగులు

ఈ విషయమై  బాదితుడి ఫిర్యాదు మేరకు  పోలీసులు దర్యాప్తు  చేశారు.  కర్ణాటకకు చెందిన ముఠా  ఈ  కారును ఎత్తుకెళ్లిందని గుర్తించారు. ఈ ముఠా  కోసం  రాచకొండకు చెందిన నాలుగు  పోలీస్ బృందాలు  కర్ణాటక రాష్ట్రానికి బయలుదేరాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?