కరాచి బేకరీపై కేసు నమోదు

Published : Oct 05, 2017, 11:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
కరాచి బేకరీపై కేసు నమోదు

సారాంశం

కరాచి బేకరీ బ్రాంచ్ లపై తూనికలు కొలతల శాఖ తనిఖీలు 4 కరాచీ బేకరీలలోని 18 ఫుడ్ ఐటమ్స్ పై కేసులు


హైదరాబాద్ లోని కరాచీ బేకరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ లోని కరాచి బేకరి బ్రాంచ్ లో బ్రెడ్ ప్యాకెట్ పై ముద్రించిన తేది వివాదాస్పదమైంది. నిన్న అంటే అక్టోబర్  4 వ తేదీన కొనుగోలు చేసిన బ్రెడ్‌ ప్యాకెట్‌ పై అక్టోబర్ 5న తయారు చేసినట్టు  ముద్రించిన విషయం తెలిసిందే. ఈ అంశం సోషల్ మీడియాలో బాగా ప్రచారం కావడంతో తూనికలు,కొలతలు శాఖ అధికారులు స్పందించారు.
తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్ రెడ్డి ఆద్వర్యంలో సోషల్ మీడియాలో వచ్చిన ముందు తేదీ ప్యాకింగ్ ఆధారంగా  తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల పరిధిలోని 14 కరాచీ బ్రాంచీలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  4 కరాచీ బేకరీలలోని 18 ఫుడ్ ఐటమ్స్ పై కేసులు నమోదు చేశారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భాస్కర్ రెడ్డి తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌