లోపలికి వెళ్లి ఎంతకూ బయటకు రాలేదు, తలుపులు బద్దలుకొట్టి చూస్తే.. : కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తె

Siva Kodati |  
Published : Aug 01, 2022, 05:25 PM IST
లోపలికి వెళ్లి ఎంతకూ బయటకు రాలేదు, తలుపులు బద్దలుకొట్టి చూస్తే.. : కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తె

సారాంశం

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తొలుత అనారోగ్య కారణాలతో ఆమె మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్లే అమ్మ చనిపోయారని వ్యాఖ్యానించారు. 

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తొలుత అనారోగ్య కారణాలతో ఆమె మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు ఆత్మహత్యగా తేల్చడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగానే ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. 

దీనిపై ఆమె కుమార్తె దీక్షిత మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతోనే తన తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే వున్నామని.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుందన్నారు. భోజనం సమయం వరకు బయటకు రాకపోవడంతో .. తలుపులు తెరిచే ప్రయత్నం చేశామని దీక్షిత చెప్పారు. లోపలి నుంచి గడియ పెట్టుకుని ఉందని.. ఆత్మహత్య సమయంలో తన భర్తతో పాటు నాన్న కూడా ఇంట్లోనే వున్నారని దీక్షిత తెలిపారు. 

Also Read:ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

మరోవైపు ఉమామహేశ్వరి ఆత్మహత్యపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురికీ తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!