కాలేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారింది.. రాహుల్ గాంధీ

Published : Nov 02, 2023, 09:10 AM IST
కాలేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారింది.. రాహుల్ గాంధీ

సారాంశం

అంబటిపల్లిలో రాహుల్ గాంధీ మహిళలతో సమావేశం అయ్యారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు.

భూపాలపల్లి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంబటిపల్లిలో ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారిందని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకి ఏంటిఎంలా మారిందంటూ ఘాటుగా స్పందించారు. 

తెలంగాణను కేసీఆర్ దోచుకున్నాడని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తాం అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ రూ. 500లకే అందిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళ ఖాతాలో రూ. 2500 ఖాతాలో జమ చేస్తామన్నారు. 

బిఆర్ఎస్, బిజెపి, ఎంఏఎం కలిసి పోటీ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు బిజెపి, ఎంఏఎం పూర్తిగా మద్దతు తెలుపుతోందన్నారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరు జరుగుతుందన్నారు. ఇక అంబటిపల్లి నుంచి రాహుల్ గాంధీ మేడిగడ్డకు బయలుదేరారు. అయితే, మేడిగడ్డలో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉందని.. రాహుల్ గాంధీకి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu
Rain Alert: వేగంగా విస్త‌రిస్తున్న రుతుప‌వ‌నాలు..ఈ ప్రాంతాల్లో వ‌చ్చే 2 రోజులు వ‌ర్షాలు