రేవంత్‌ రెడ్డికి షాక్: నోటీసులు జారీ చేసిన పోలీసులు

Published : Sep 12, 2018, 12:28 PM ISTUpdated : Sep 19, 2018, 09:23 AM IST
రేవంత్‌ రెడ్డికి షాక్: నోటీసులు జారీ చేసిన పోలీసులు

సారాంశం

 కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో అవకతవకల కేసులో  ఈ నోటీసులు జారీ చేశారని సమాచారం. అయితే ఎన్నికల బిజీలో  ఉన్నందున తాను హాజరుకాలేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు.


తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారనే విషయమై రేవంత్‌ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 2001 జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో పోలీసులు  నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసులపై 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని రేవంత్ ను పోలీసులు కోరారు. అయితే  ఈ విషయమై రేవంత్ రెడ్డి పోలీసులకు సమాధానమిచ్చారు.ఎన్నికల బిజీలో ఉన్నందున తాను  హాజరుకాలేనని రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ కేసు విషయమై రేవంత్ రెడ్డితో పాటు  మరో 13 మందికి కూడ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

పాస్‌పోర్ట్ కేసులో జగ్గారెడ్డిని మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. తాజాగా రేవంత్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో  కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆందోళన  నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు  ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu