పంజగుట్టలో ఘోరం: బైక్ ను ఢీకొట్టిన కారు, ఫ్లై ఓవర్ నుంచి కిందపడి జర్నలిస్టు మృతి

Published : Jun 30, 2019, 08:21 AM IST
పంజగుట్టలో ఘోరం: బైక్ ను ఢీకొట్టిన కారు, ఫ్లై ఓవర్ నుంచి కిందపడి జర్నలిస్టు మృతి

సారాంశం

బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్‌ వైపు వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నది.బైక్‌పై వెళ్తున్న పత్రికా జర్నలిస్ట్ మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ప్లైఓవర్‌పై నుంచి కిందపడి మృతి చెందాడు. 

హైదరాబాద్‌: హైదరాబాదులోని పంజగుట్ట ఫ్లైఓవర్ పై ఘోరం జరిగింది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్‌ వైపు వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నది.బైక్‌పై వెళ్తున్న పత్రికా జర్నలిస్ట్ మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ప్లైఓవర్‌పై నుంచి కిందపడి మృతి చెందాడు. 

బైక్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని కరీంనగర్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. 

అయితే కారు నడుపుతున్న వ్యక్తి  కారణంగానే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది వాహనదారులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇందుకు క‌దా జ‌నాలకు హైద‌రాబాద్ అంటే పిచ్చి.. వైర‌ల్ అవుతోన్న ఉద్యోగి వీడియో
Hyderabad : వస్తావా..? నీ రేట్ ఎంత..? : అర్థరాత్రి ఓ మహిళా ఐపిఎస్ కు ఎదురైన అనుభవం