తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఇటీవల రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే సోదాలు సందర్భంగా ఓ ల్యాప్ ట్యాప్ విషయంలో హైడ్రామా కొనసాగింది.
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఇటీవల రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే సోదాలు సందర్భంగా ఓ ల్యాప్ ట్యాప్ విషయంలో హైడ్రామా కొనసాగింది. ప్రస్తుతం ఆ ల్యాప్ ట్యాప్ బోయిన్పల్లి పోలీసు స్టేషన్లోనే ఉండగా.. అది ఎవరిదనే విషయంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. సోదాలు చేస్తున్న సమయంలో తమ ల్యాప్ ట్యాప్ పోయిందని ఐటీ అధికారి రత్నాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాసేపటికే మల్లారెడ్డి అనుచరులు ఓ ల్యాప్ట్యాప్ను బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు.
అయితే దీంతో పోలీసులు ల్యాప్ ట్యాప్ తీసుకెళ్లాలని ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఐటీ అధికారులు మాత్రం అది తమ ల్యాప్ ట్యాప్ కాదని చెబుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి కూడా ఆ ల్యాప్ ట్యాప్ తనది కాదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ ల్యాప్ ట్యాప్ విషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వారం రోజులుగా పోలీసు స్టేషన్లోనే ల్యాప్ ట్యాప్ ఉండటంతో.. అది ఎవరిదో తెలుసుకునేందుకు ఎఫ్ఎస్ఎల్కు పంపేందుకు సిద్దమవుతున్నారు. ఆ నివేదిక ఆధారంగా ల్యాప్ ట్యాప్ ఎవరిదని దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.