హైదరాబాద్: ఆరేళ్లలో రూ.700 కోట్లు.. వెలుగులోకి రియల్ ఎస్టేట్ కంపెనీల బండారం

Siva Kodati |  
Published : Mar 31, 2021, 10:13 PM IST
హైదరాబాద్: ఆరేళ్లలో రూ.700 కోట్లు.. వెలుగులోకి రియల్ ఎస్టేట్ కంపెనీల బండారం

సారాంశం

హైదరాబాద్‌లో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రెండు సంస్థలు యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టు పక్కల వెంచర్ల‌తో పాటు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నాయి

హైదరాబాద్‌లో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రెండు సంస్థలు యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టు పక్కల వెంచర్ల‌తో పాటు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నాయి.

ఈ సంస్థలపై చేసిన దాడుల్లో రూ. 11.8 కోట్ల నల్లధనంతో పాటు రూ.1.93 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ రెండు సంస్థలు గడిచిన ఆరేళ్ల కాలంలో రూ. 700 కోట్ల నల్లధనం లావాదేవీలకు పాల్పడినట్లు ఆధారాలు గుర్తించారు.

తనిఖీల్లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్లు, నల్ల ధనానికి సంబంధించిన చేతిరాత పుస్తకాలను సీజ్ చేశారు. ఈ రెండు  సంస్థలు నగదు లావాదేవీలతో పలు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. 

PREV
click me!

Recommended Stories

Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం