హైదరాబాద్: ఆరేళ్లలో రూ.700 కోట్లు.. వెలుగులోకి రియల్ ఎస్టేట్ కంపెనీల బండారం

Siva Kodati |  
Published : Mar 31, 2021, 10:13 PM IST
హైదరాబాద్: ఆరేళ్లలో రూ.700 కోట్లు.. వెలుగులోకి రియల్ ఎస్టేట్ కంపెనీల బండారం

సారాంశం

హైదరాబాద్‌లో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రెండు సంస్థలు యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టు పక్కల వెంచర్ల‌తో పాటు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నాయి

హైదరాబాద్‌లో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రెండు సంస్థలు యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టు పక్కల వెంచర్ల‌తో పాటు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నాయి.

ఈ సంస్థలపై చేసిన దాడుల్లో రూ. 11.8 కోట్ల నల్లధనంతో పాటు రూ.1.93 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ రెండు సంస్థలు గడిచిన ఆరేళ్ల కాలంలో రూ. 700 కోట్ల నల్లధనం లావాదేవీలకు పాల్పడినట్లు ఆధారాలు గుర్తించారు.

తనిఖీల్లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్లు, నల్ల ధనానికి సంబంధించిన చేతిరాత పుస్తకాలను సీజ్ చేశారు. ఈ రెండు  సంస్థలు నగదు లావాదేవీలతో పలు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే