క్యూనెట్ ఆస్తులను జప్తు చేయాలి: వీసీ సజ్జనార్

By narsimha lodeFirst Published May 31, 2023, 10:28 AM IST
Highlights


క్యూనెట్  సంస్థ  ఆస్తులను  జప్తు  చేయాలని  ఐపీఎస్ అధికారి  వీసీ సజ్జనార్  కోరారు.

హైదరాబాద్:  దేశంలో  క్యూనెట్ అరాచకాలు కొనసాగుతున్నాయని  ఐపీఎస్ అధికారి , తెలంగాణ ఆర్టీసీ ఎండీ  వీసీ సజ్జనార్  చెప్పారు.పెట్టుబడి పేరుతో క్యూనెట్ సంస్థ మోసాలకు  పాల్పడుతుందని  హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్  నిన్ననే  ప్రకటించారు.

also read:మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్ ప్రతినిధులు అరెస్ట్: సీవీ ఆనంద్

 ఈ మేరకు  క్యూనెట్  సంస్థకు  చెందిన ముగ్గురిని నిన్న  అరెస్ట్  చేశారు హైద్రాబాద్ పోలీసులు. 

 

Instances of fraud persisting in the country have come to light. Recently, Telangana Police apprehended three individuals, including Rajesh Kanna, the primary culprit, involved in fraudulent practices under the guise of QNET Multilevel Marketing. In the unfortunate incident… pic.twitter.com/STBWpFfUK6

— V.C. Sajjanar, IPS (@SajjanarVC)

క్యూనెట్ సంస్థకు  చెందిన ముగ్గురిని  అరెస్ట్  చేసిన మరునాడే  ఈ విషయమై  వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా  స్పందించారు.మోసపూరిత  క్యూనెట్  వ్యవహరంపై  విచారణ  జరిపించాలని  ఆయన  కోరారు.  స్వప్నలోక్  ఘటనలో  ఆరుగురిని  పొట్టన పెట్టుకున్నారని  సజ్జనార్ ఆరోపించారు. మల్టీలెవల్  మార్కెటింగ్    సంస్థలపై  ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని  సజ్జనార్  కోరారు. క్యూనెట్  సంస్థల  ఆస్తులను  జప్తు  చేయాలని సజ్జనార్ డిమాండ్  చేశారు. 

click me!