ఇంటర్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు: సెక్రటరీ జలీల్ హెచ్చరిక

Published : Mar 24, 2021, 04:23 PM IST
ఇంటర్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు: సెక్రటరీ జలీల్ హెచ్చరిక

సారాంశం

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ జలీల్ హెచ్చరించారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ జలీల్ హెచ్చరించారు.

కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను ఇవాళ్టి నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23న ప్రకటించింది.

ప్రత్యక్షతరగతులు లేని సమయంలో ఆన్ లైన్ క్లాసులు కొనసాగించాలని ఆయన కోరారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా నడుపుతున్నారనే ఫిర్యాదులు రావడంతో ఇంటర్ బోర్డు సెక్రటరీ జలీల్ బుధవారం నాడు ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి రాష్ట్రంలో విద్యాసంస్థలు 
ప్రారంభమయ్యాయి. అయితే విద్యా సంస్థల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఇవాళ్టి నుండి విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది మే లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లో ఇప్పటివరకు క్లాసులు సాగుతున్నాయి. టెన్త్, ఇంటర్ లలో ఇప్పటికే కొంత సిలబస్ ను తగ్గించారు. 
 

PREV
click me!

Recommended Stories

బిఆర్ఎస్ అకౌంట్లో రూ.1400 కోట్లు... ఎలా వచ్చాయి? : నిలదీసిన మంత్రి వివేక్
మీ కళ్లు చల్లబడ్డాయా?: Singer P Susheela emotional on Singer S Janaki's demise | Asianet News Telugu