కారు కింది భాగంలో 25 కేజీల గోల్డ్ స్మగ్లింగ్: పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు

By Siva KodatiFirst Published Mar 24, 2021, 4:14 PM IST
Highlights

హైదరాబాద్‌లో మరోసారి భారీగా బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. పంతంగి టోల్‌గేట్ వద్ద 25 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు కోల్‌కతా నుంచి చెన్నైకి తరలిస్తుండగా పక్కా సమాచారంతో అధికారులు పట్టుకున్నారు. 

హైదరాబాద్‌లో మరోసారి భారీగా బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. పంతంగి టోల్‌గేట్ వద్ద 25 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు కోల్‌కతా నుంచి చెన్నైకి తరలిస్తుండగా పక్కా సమాచారంతో అధికారులు పట్టుకున్నారు.

బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలని మాఫియా ఓ ముఠాకు పని అప్పగించింది. కారులో రహస్యంగా బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు కింది భాగంలో బంగారాన్ని అమర్చారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.12 కోట్లు  వుంటుందని అంచనా. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!