అక్రమ సంబంధమే: చంపేసి, మర్మాంగం కోసి...

By pratap reddyFirst Published Jan 17, 2019, 12:26 PM IST
Highlights

రవి జీవన విధానమే చాలా విచిత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ మహిళతో అతను సంబంధం కొనసాగిస్తున్నాడని సమాచారం. ఆమెను అతను పెళ్లి చేసుకున్నాడా, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా అనేది తేలడం లేదంటున్నారు. 

హైదరాబాద్:  హైదరాబాదులోని పాతబస్తీ ఘాన్సీ బజార్ లో జరిగిన హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. మద్యం సేవించినప్పుడు జరిగిన గొడవలో రవి అలియాస్ పీటర్ రవి (42)ని హత్య చేశారని భావించారు. ఓ మహిళతో సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

రవి జీవన విధానమే చాలా విచిత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ మహిళతో అతను సంబంధం కొనసాగిస్తున్నాడని సమాచారం. ఆమెను అతను పెళ్లి చేసుకున్నాడా, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా అనేది తేలడం లేదంటున్నారు. 

అతను మూడేళ్లుగా అక్కాబావలకు దూరంగా ఉంటున్నాడు. ఓ పాడుబడిన గుడిలో నివాసం ఉంటున్నాడు. అతను అలా ఎందుకు ఉంటున్నాడనేది ఆశ్చర్యకరంగా మారింది. 

ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రవి పరుగులు తీసినప్పటికీ లాభం లేకపోయింది. దుండగులు అతడిని వెంటాడి కత్తులతో దాడి చేశారు. అందరూ చూస్తుండగా అత్యంతక కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. 

కత్తులతో దాడి చేసి హత్య చేసి మర్మాంగం కోసేశారు. మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే ఆగ్రహంతోనే వారు ఆ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో మరో దారుణం...నడిరోడ్డుపైనే దారుణ హత్య

ఇంటికి వెళ్లకుండా... హత్యకు కారణమేమిటి.. (వీడియో)

click me!